telugu navyamedia
సినిమా వార్తలు

అమ్మా.. వీళ్లెవరూ నాకు కనెక్ట్‌ కావట్లేదే..

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా ‘వరడు కావలెను’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఫీల్‌గుడ్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న‌ ‘వరుడు కావలెను’ చిత్రం టీజర్‌ను విడుదల చేసారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Varudu Kaavalenu Teaser Out - Sakshi

ఈ సినిమా షూటింగ్‌ ఇప్పటికే పూర్తికాగా ప్రస్తుతం ప్రీప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. వాస్తవానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం థియేటర్లు తిరిగి తెరుచుకోవడంతో సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందంద సిద్ధమైంది. ఈ క్రమంలోనే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్‌లో థియేటర్‌లలో విడుదల కానుంది.

Pic Talk: Uber Cool Naga Shaurya from Varudu Kaavalenu

ఇదిలా ఉంటే సినిమా విడుదల తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో ప్రమోషన్‌ వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్‌ టీజర్‌ను విడుదల చేసింది. కృష్టాష్టమి పురస్కరించుకొని ఈ టీజర్‌ను విడుదల చేశారు. నిమిషం నిడివి ఉన్న ఈ టీజర్‌ను గమనిస్తే సినిమా మొత్తం ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఉండేలా కనిపిస్తోంది.

‘‘అమ్మా.. వీళ్లెవరూ నాకు కనెక్ట్‌ కావట్లేదే.. అని రీతువర్మ..ఆ అందం.. పొగరు అర్డర్‌ ఇచ్చి చేయించినట్లు ఉంటుంది అని నాగశౌర్యఏడారిలో ఐస్‌ తయారు చేయడానికి చూస్తున్నాడు…’’ అని వెన్నెల కిశోర్‌ చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి.

Varudu Kaavalenu Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News &  Videos | eTimes

ఇక నాగశౌర్య, రీతూ వర్మల మధ్య ఉన్న సన్నివేశాలను ఆకట్టుకుంటున్నాయి. టామ్‌ అండ్‌ జెర్రీలా నిత్యం గొడవ పడుతోన్న ఈ జంట మధ్య ప్రేమ ఎలా పుట్టిందన్న అంశాన్ని దర్శకుడు ఎలా చూపించనున్నాడన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ద్వారా మరో అందమైన ప్రేమ కథ వెండి తెరపై తళుక్కుమనున్నట్లు టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. ప్ర‌స్తుతం విడుద‌లైన టీజర్‌పై ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌ల‌గ‌జేస్తుంది.

Related posts