telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగచైతన్యతో మరోసారి రకుల్..!

Rakul

అక్కినేని హీరో నాగ చైతన్య, విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్ లో ‘థ్యాంక్యూ’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోంది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నారు. నాగ‌చైత‌న్యకి ఇది 20వ సినిమా కావడం విశేషం. ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తారని తెలుస్తోంది. వీరిలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ ని ఇప్పటికే ఎంపిక చేసినట్టు వార్తలొచ్చాయి. మరో కథానాయిక పాత్రకు తమిళ ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ ను తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ విషయంలో ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుగుతున్నాయట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇతర నటీనటుల ఎంపిక కూడా పూర్తికావచ్చింది. అక్టోబర్ మొదటి వారం నుంచి షూటింగును నిర్వహించాలని షెడ్యూల్స్ వేస్తున్నారట. గతంలో చైతూ, రకుల్ కలసి ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రంలో నటించారు.

కాగా విభిన్న కథా చిత్రాల దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్. ఇష్క్ సినిమాతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టిన విక్రమ్… ఏకంగా అక్కినేని కుటుంబం డ్రీం ప్రాజెక్ట్ ‘మనం’ సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో విక్రమ్ కె.కుమార్ స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఆ తర్వాత అఖిల్ తో చేసిన ‘హలో’ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తాజాగా అక్కినేని నాగచైతన్యతో సినిమాని చేసేందుకు రెడీ అయిపోయారు విక్రమ్.

Related posts