అక్కినేని నాగ చైతన్య సమంత తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉన్నారు. సాధారణంగానే సమంతతో పోలిస్తే నాగ చైతన్య సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటాడు. తాజాగా నాగచైతన్య చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
పాపులర్ రైటర్ మాథ్యూ రాసిన ‘గ్రీన్ లైట్స్’ అనే పుస్తకాన్ని షేర్ చేసిన చైతూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ‘లవ్ లెటర్స్ టూ లైఫ్..మీ జర్నీని షేర్ చేసినందుకు చాలా ధన్యవాదాలు మాథ్యూ.. ఈ పుస్తకం నాకు నిజంగా గ్రీన్ లైట్ అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
ఎప్పుడూ ప్రేమ, జీవితం లాంటి వాటిపై సోషల్ మీడియాలో పెద్దగా స్పందించని చైతూ..బ్రేకప్ తర్వాత ఇన్స్టాలో తొలిసారి చేసిన పోస్ట్ కాస్త నెట్టింట వైరల్గా మారింది.
సామ్తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన చై ప్రస్తుతం ఆ ఙ్ఞాపకాల్లోంచి బయటకొచ్చేందుకు బుక్ రీడింగ్ అలవాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిపోయాడు.