లవ్ స్టోరీలను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా కుటుంబం మొత్తం కలిసి చూసేలా తెరపై అందంగా రూపొందించగల టాలీవుడ్ ప్రముఖ దర్శకులలో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయి పల్లవి కథానాయికగా తెరకెక్కిన “ఫిదా” చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తరువాత మరో ప్రాజెక్టును చేయడానికి శేఖర్ కమ్ముల చాలా సమయం తీసుకున్నాడు. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తన కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. మలయాళ బ్యూటీ సాయి పల్లవి ఈ చిత్రంలో చైతన్యకు జోడిగా నటించనుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా కొత్త చిత్రం గురువారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ సినిమా పూజ కార్యక్రమాలు సికింద్రాబాద్ వినాయకుడి ఆలయంలో జరిగాయి. డిస్ట్రిబ్యూటర్స్గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో సినిమా ప్రారంభం కానుంది. ఈ ఏడాది చివరలో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విజయ్.సి.కుమార్, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సంబంధించిన వివరాలను త్వరలోనే తెలియజేస్తారు.
previous post
next post
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్