గత కొన్ని రోజులుగా అంతుచిక్కని వ్యాధి ఏలూరులో ప్రతి ఒక్కరిని భయపెడుతున్నది. దాంతో వైద్యులు, నిపుణులు ఈ వ్యాధిపైనే దృష్టి పెట్టారు. వ్యాధికి గల కారణాలు పరిశోధిస్తున్నారు. ఎన్ఐఎన్, ఎయిమ్స్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ తదితర సంస్థలు అంతుచిక్కని వ్యాధిపై పరిశోధనలు చేస్తున్నాయి. ఈరోజు రిపోర్ట్ ఇవ్వబోతున్నాయి. ఆయా సంస్థలు ఇచ్చే రిపోర్ట్ లను బట్టి ఈ వ్యాధి ఏంటి? ఎందుకు వచ్చింది? నీరే కారణమా లేదంటే మరేమైనా కారణమా అనే విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. నీటి పైపులు, చెరువులు చుట్టూ నివసిస్తున్న ప్రజలు ఎక్కువగా ఈ అంతుచిక్కని వ్యాధితో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. శరీరంలో కలుషితం తగ్గిపోవడంతో కోలుకొని డిశ్చార్జ్ అవుతున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఈ మిస్టరీని చెందించే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇక ఇదిలా ఉంటె, ఏలూరు ఘటనపై ఏపీ ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వింత వ్యాధి గురించిన వివరాలను తెలుసుకునేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులు ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం 81 మంది బాధితులు ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు.
previous post
next post
హిందూ గ్రంధాల్లో కావాల్సినంత హింస: సీతారాం ఏచూరి