సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ మిర్యాలగూడలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా తీసిన కల్పిత చిత్రం “మర్డర్”. వర్మ బ్రాండ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.. ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సాహితిముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని నట్టీస్ ఎంటర్టైన్మెంట్, క్విటీ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టి కరుణ, నట్టి క్రాంతి నిర్మిస్తున్నారు. అయితే… ఈ సినిమా విడుదల నిలిపివేయాలని ప్రణయ్ తండ్రి బాలస్వామి నల్గొండ జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ అనంతరం సినిమాను విడుదల చేయాలని చిత్రయూనిట్ ను కోర్టు ఆదేశించింది. ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ నెల 18న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా రాం గోపాల్ వర్మ తన ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
previous post
నాగబాబు వల్లే గెలిచామా ? మీరెవరు చెప్పడానికి ? : జీవితరాజశేఖర్