telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ.. కాంగ్రెస్ నేతకు గాయాలు

Congress Website hacking gujarat

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నేడు ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల రాజకీయ పార్టీలు రెచ్చిపోతున్నాయి. నిఘా వేసుకుంటూ అనుమానం వచ్చినచోట అడ్డుకోవడం, వాగ్వాదాలు.. కొనసాగుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గంజిపేట పోలింగ్ కేంద్రం వద్ద ఈరోజు ఉదయం ఎంఐఎం. కాంగ్రెస్ నేతలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కు చెందిన శంకర్ అనే వ్యక్తి గాయపడ్డారు.

పోలింగ్ జరుగుతుండగా గంజిపేట పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చిన కాంగ్రెస్ నేత శంకర్ ఎంఐఎం ఓటర్లను ప్రలోభ పెడుతోందంటూ అక్కడి వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎంఐఎం సభ్యులు ఎదురు తిరిగారు. ఇరువర్గాలు పరస్పరం తోపులాటకు దిగడంతో ఘర్షణ మొదలయ్యింది. ఈ ఘర్షణలో శంకర్ కాలికి గాయమయింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని లాఠీచార్జితో ఇరువర్గాలను చెదరగొట్టారు.

Related posts