రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూడలేక కేసీఆర్ అణచివేత చర్యలకు దిగుతున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ ప్రజలు విస్పష్టమైన తీర్పు ఇచ్చినా అధికార టీఆర్ఎస్ పార్టీ వారిని అవమానించిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ దొడ్డిదారిలో అధికారం చేజిక్కించుకున్నారని ధ్వజమెత్తారు.
చైర్మన్ పదవి నైతికంగా బీజేపీదేనని, అధికారం కోసం కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి నీచరాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ పతనానికి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు నాంది కాబోతున్నాయని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు పన్నినా మోదీ నిర్ణయాలే బీజేపీకి బలమన్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని తెలిపారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణపై పవన్ ప్రశంసలు