తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ రోజు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగుతోన్న నేపథ్యంలో సీపీఎం కార్యకర్తలను కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అలాగే, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని, ఇరు పార్టీల కౌన్సిలర్లు చొక్కాలు పట్టుకుని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో రాజగోపాల్రెడ్డి ప్రమాణ పత్రాలను చించేశారు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. పోలీసులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దీంతో అక్కడ పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది.