telugu navyamedia
వార్తలు సామాజిక

భారీ వర్షాలతో ముంబై అతలాకుతలం.. బయటకు రావద్దని బీఎంసీ హెచ్చరికలు

heavy rains in telangana for 2days

ఎడతెరపీలేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై అతలాకుతలమైంది. భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ముంబై వాసులకు తాజాగా వాతావరణ శాఖ  మరో హెచ్చరిక చేసింది. రాగల 48 గంటల్లో ముంబైతోపాటు సమీప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలెర్ట్ ప్రకటించారు.

భారీ వర్షాలు కురుస్తుండడంతో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని బీఎంసీ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. , దాదర్, సియాన్, హింద్ మాత, జోగేశ్వరి ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నిన్న కురిసిన భారీ వర్షానికి బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో 201 మిల్లీ మీటర్ల భారీ వర్షపాతం నమోదు కాగా, కొలాబాలో 152, శాంతాక్రజ్‌లో 159.7 వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Related posts