పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఒకరైన బాలీవుడ్ సినీ నటి, మోడల్ గెహనా వశిష్ట్ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. గెహనా వశిష్ట్కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన వినిపించారు.
గెహనా వశిస్ట్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ను ముంబై సెషన్స్ కోర్టు కొట్టివేసింది.. దీంతో పూర్తి వివరాలతో కోర్టు నుంచి కాపీ అందిన తర్వాత తాము ముంబై హై కోర్టును ఆశ్రయిస్తామని గెహనా వశిష్ట్ తరపు అడ్వకేట్ మీడియాకు తెలిపారు.
శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఆరోపణలు ఎదుర్కొంటున్న పోర్నోగ్రఫీ కేసుకు సంబంధించిన మరో వ్యవహారంలో జులై 27న గెహనా వశిష్ట్పై మూడో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ నేపథ్యంలో అరెస్ట్ కంటే ముందుగా ముందస్తు బెయిల్ తెచ్చుకునేందుకు గెహనా వశిష్ట్ ముంబైలోని లోకల్ కోర్టును ఆశ్రయించింది.
అయితే, ఈ కేసులో మరో కొత్త బాధితుడు ఆమెకు వ్యతిరేకంగా తమను ఆశ్రయించినందున ఆమెను ప్రశ్నించాల్సిన అవసరం ఉందని, అందువల్ల ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కోర్టుకు తెలిపారు.