telugu navyamedia
క్రీడలు వార్తలు

తిరిగి వచ్చేస్తున్నా ధోనిసేన…

భారత్ లో కరోనా ప్రభావం అధికంగా ఉన్న కారణంగా ఐపీఎల్ 2020 యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయిచడంతో అన్ని జట్లు అక్కడికి వెళ్లాయి. అయితే ఇప్పుడు ఈ టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఐపీఎల్ 2020 లీగ్ మ్యాచ్ లు ముగుస్తాయి. ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ కి ముంబై, ఢిల్లీ, బెంగుళూరు చేరుకుంటే పంజాబ్, రాజస్థాన్, చెన్నై ఆ రేస్ నుండి తప్పుకున్నాయి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలో ప్లే ఆఫ్స్ కి వెళ్ళకపోవడం ఇదే మొదటిసారి. ఐపీఎల్ 2020 లో మొత్తం 14 మ్యాచ్ లు ఆడిన చెన్నై 6 మ్యాచ్ లలో విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో 7 వ స్థానంతో లీగ్ ను ముగించింది. అయితే ఐపీఎల్ లో పాల్గొనడానికి చివరగా యూఏఈ వెళ్లిన చెన్నై జట్టు ఇప్పుడు అందరికంటే ముందుగా భారత్ కు తిరిగి వస్తుంది. దానికి సంబంధించిన ఫోటోను కరణ్ శర్మ ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అయితే ఈ జట్టులోని రవీంద్ర జడేజా, శార్దూల ఠాకూర్ ఈ ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత  జట్టు వెళ్లే ఆసీస్ పర్యటనకు సెలక్ట్ అయిన కారణంగా అక్కడే ఉన్నారు. వీరు భారత జట్టుతో ఆసీస్ పర్యటనకు ఐపీఎల్ ముగిసిన తర్వాత వెళ్తారు.

Related posts