telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రఘురామకృష్ణరాజు వ్యవహారంపై .. రేపు ఢిల్లీ వెళ్లనున్న వైసీపీ ఎంపీలు!

raghauramakrishnam raju mp

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం తెల్చేందుకు వైసీపీ ఎంపీలు రేపు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళుతున్నారు. వారు స్పీకర్ ఓం బిర్లాతో సమావేశం కానున్నారు. రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలంటూ వారు స్పీకర్ ను కోరనున్నారు. అనేక అంశాల నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం రఘురామకృష్ణరాజుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే ఆయనకు షోకాజ్ నోటీసులు కూడా పంపారు.

నోటీసులపై సంజాయిషీ ఇవ్వకపోగా, ఆ షోకాజ్ నోటీసులనే ప్రశ్నించడం ద్వారా రఘురామకృష్ణరాజు మరింత ఆజ్యం పోశారు. వైసీపీ హైకమాండ్ దీన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీకి దూరం కావాలన్న ఉద్దేశంతోనే రఘురామకృష్ణరాజు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన నరసాపురం ఎంపీ ఇప్పటికే ఢిల్లీ వెళ్లి స్పీకర్ ను, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తన వాదనలు వినిపించారు.

Related posts