భారతరత్న అవార్డులపై హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారతరత్న అవార్డులంటే బ్రాహ్మణ క్లబ్ అని అసద్ ఆరోపించారు. బ్రాహ్మణ క్లబ్ తోపాటు ఇతర ఉన్నత కులాల వారికే భారతరత్నలు వస్తాయని పార్లమెంటులో అసద్ విమర్శించారు. ఇలా ఉన్నత వర్గాలకు అవార్డులివ్వడాన్ని తాను ఖండిస్తున్నానని అసద్ అన్నారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు.