telugu navyamedia
సినిమా వార్తలు

“సినిమా పోస్టర్ ” ఈశ్వర్ ప్రస్థానం ..

తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్రాసిన విలక్షణ  పబ్లిసిటీ ఆర్టిస్ట్ ఈశ్వర్ .
ఈశ్వర్ కు సినిమా రంగంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం వచ్చాయంటే అందుకు ఆయన ప్రతిభే కారణం . ఆయన వందల సినిమాలకు పోస్టర్ డిజైన్ లను తయారు చేశారు. అలాగే నటి నటుల పెయింటింగ్ లను కూడా అద్భుతంగా గీశారు .

ఆయన పూర్వీకులు శిల్ప కళలో నిపుణులు కావడంతో వంశపారంపర్యంగా ఈశ్వర్ కు కూడా ఆ కళ పుట్టుకతోనే వచ్చింది . చిన్నపుడు , నాటకాలు రాసి రంగస్తలంపై ప్రదర్శించేవారు . ఆ నాటకాలకు తానే బొమ్మలు గీసేవాడు . ఆ బొమ్మలను అందరు మెచ్చుకునేవారు .

పాలిటెక్నీక్ చదువుతూ ఉండగా తల్లి మ‌ర‌ణించింది. దాంతో చదువు ఆగిపోయింది . అప్పుడు ఎదో ఒక పనిచేసుకుందామని మద్రాస్ వచ్చారు . తనకు వచ్చిన విద్య బొమ్మలు వేయడం , ఆ వృత్తిలోనే కొనసాగాలని సినిమా రంగంలో వున్న ఆర్టిస్టు తమ కుటుంబానికి తెలిసిన కేతా దగ్గర శిష్యుడుగా చేరిపోయాడు . 1961 నుంచి 66 వరకు పబ్లిసిటీ లో అనుభవం సంపాదించాడు . 1967వ సంవత్సరంలో కేతా నుంచి బయటకు వచ్చి స్వంతంగా సినిమాలకు పనిచెయ్యడం మొదలు పెట్టాడు .

50 glorious years of Sakshi

తెలుగులో బాపు గారు దర్శకత్వం వహించిన “సాక్షి ” సినిమాకు ఈశ్వర్ డిజైన్ లు తయారు చేశారు . అవి బాపు గారి కి ఎంతో నచ్చాయి . ఈశ్వర్ గారి గురించి విని విజయా స్టూడియోస్ నాగిరెడ్డి , చక్రపాణి గారు తమ సినిమాలకు పనిచెయ్యమని ఆహ్వానించారు . ఆ తరువాత ఈశ్వర్ అవిశ్రాంతంగా పనిచేశారు . ఎంతో పేరు సంపాదించారు .

ఈశ్వర్ తన సినిమా జీవితంలో కొన్ని వందల సినిమాలకు పనిచేశారు . అయితే అందులో ఆయనకు బాగా నచ్చిన సినిమాలు “పాపకోసం “, ” ప్రేమ్ నగర్ ” చిత్రాలని చెబుతాడు . అవి ఇతర భాషల్లో రూపొందించినప్పుడు వాటికి కూడా ఈశ్వరే డిజైన్స్ తయారు చేశారు . అలాగే తెలుగు తమిళ రంగాల్లో నటీనటుల పెయింటింగులు గీయడంలో ఈశ్వర్ సిద్ధహస్తుడు .

1970 వ సంవత్సరంలో తమిళనాడుకు కరుణానిధి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈశ్వర్ ఇంటికి వచ్చి అన్నాదురై 9 అడుగుల చిత్రం కావాలని అడిగారు . అందుకు ఒక నెల రోజులు సమయం కూడా ఇచ్చారు . అనుకున్న సమయానికి ఈశ్వర్ అన్నాదురై అద్భుతమైన పెయింటింగ్ తయారు చేసి ఇచ్చారు. ఆ పెయింటింగ్ ను రాజాజీ హాలు లో అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆవిష్కరించారు . ఆ సందర్భంగా ఇందిరాగాంధీ సంతకం చేసిన ఒక ఒక సరిఫికేటును ఈశ్వర్ కు బహుకరించారు .

Publicity designer Eswara Rao is no more - Telugu News - IndiaGlitz.com

ఈశ్వర్ తెలుగు సినిమా రంగంలో 52 మంది పబ్లిసిటీ ఆర్టిస్టులను తయారు చేశారు . వారంతా గురువు ఈశ్వర్ మంచితనాన్ని మెచ్చుకుంటారు . ఈశ్వర్ ఒక సినిమాకు దర్శకత్వం వహించారు . ఆ సినిమా రెండు వారాలు మాత్రమే ఆడింది . అయితే ఆ సినిమా ఈశ్వర్ చేసు అనుభవాన్నే మిగిల్చింది .

2011లో తన అనుభవాలు , తాను తయారు చేసిన డిజైన్ లు, పెయింటింగులతో ” సినిమా పోస్టర్ ” అనే పుస్తకం ప్రచురించారు . దీనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది బహుమతి లభించింది .
తెలుగు సినిమా వెలుగుల ప్రస్థానం “సినిమా పోస్టర్ ‘లో మనకు కనిపిస్తుంది .
-భగీరథ

Related posts