telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కత్తి మహేశ్ అరెస్ట్… నాంపల్లి కోర్టులో హాజరు

Kathi

సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తి మహేష్ తన ఫేస్ బుక్ ఖాతాలో “రాముడు కరోనా ప్రియుడు” అంటూ పోస్ట్ చేయడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేసారు. అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను అతడిపై Ipc section 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసారు. కత్తి మహేశ్ తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలను నిర్వహించి, హైదరాబాదులోని నాంపల్లి కోర్టులో ఆయనను హాజరుపరిచారు. మహేశ్ పై 2018 నుంచి సైబర్ క్రైమ్ స్టేషన్ లో దాదాపు 5 కేసులు నమోదయ్యాయి. కాగా హిందువులు ఆరాధించే శ్రీరాముడిపై ఫేస్ బుక్ లో అసభ్య కామెంట్లను పోస్ట్ చేశారంటూ గతంలో కత్తి మహేశ్ పై హిందూ సంస్థలతో పాటు పలువురు వ్యక్తులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీటిపై కేసులు నమోదు చేసి, విచారణ జరిపిన సైబర్ క్రైమ్ పోలీసులు… ఆ పోస్టులను మహేశ్ పోస్ట్ చేశారని నిర్ధారించారు.

Related posts