మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేసీఆర్కు మోత్కుపల్లి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
అంతకు ముందుగా మోత్కుపల్లి ట్యాంక్బండ్పై ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బషీర్ బాగ్ కూడలిలోని మాజీ ఉప ఉపప్రధాని బాబు జగ్జీవన్ రాం విగ్రహం, గన్పార్క్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి నేరుగా తెలంగాణ భవన్కు బయలుదేరిన ఆయన తెరాసలో చేరారు.