ఈ దేశం ఆ దేశం అని లేకుండా.. మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. అత్యాచారాల సంఖ్య తగ్గడం లేదు. తాజాగా పాకిస్తాన్ లో ఉద్యోగం పేరుతో ఓ ముఠా మోసం చేసింది. ఉద్యోగం ఆశ చూపించి మహిళను బంధించి ఓ గ్యాంగ్ రేప్ చేసింది. మహిళతో పాటుగా ఆమె నాలుగేళ్ల కూతురిపై కూడా ఆ గ్యాంగ్ రేప్ కు పాల్పడింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ మహిళను, చిన్నారిని ఓ వ్యభిచార గృహానికి అమ్మేసింది గ్యాంగ్. అయితే, పోలీసులు దాడులు చేసి ఆ మహిళను, చిన్నారిని రక్షించారు. ప్రస్తుతం మహిళ, చిన్నారి ఓ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చిన్నారి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం కరాచీకి చెందిన ఓ మహిళ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుండగా, ఓ గ్యాంగ్ ఆమెకు నెలకు రూ.40 వేల జీతం ఇప్పిస్తామని చెప్పారు. ఎక్కువ జీతం కావడంతో పాపం ఆ మహిళ ఉద్యోగం చేసేందుకు అంగీకరించింది. గ్యాంగ్ చెప్పినట్టుగా కరాచీ నుంచి కశ్మోర్ కి వెళ్ళింది. అక్కడి వెళ్లిన ఆమెను బంధించి అత్యాచారం చేసినట్టు పోలీసులు తెలిపారు.
previous post
next post