telugu navyamedia
రాజకీయ వార్తలు సినిమా వార్తలు

విద్యార్థుల జీవితాలతో బాబు సర్కారు ఆడుకుంటోంది: మోహన్ బాబు

Mohanbabu demand fees reimbursement

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పై నటుడు మోహన్ బాబు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఈ ఉదయం తిరుపతిలో వందలాది మంది విద్యార్థులు, తన కుమారులు విష్ణు, మనోజ్ లతో కలిసి కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు సర్కారు ఆడుకుంటోందని విమర్శించారు. కళాశాలల యాజమాన్యాలకు చెల్లించాల్సిన డబ్బును ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు.చంద్రబాబు వైఖరికి నిరసనగానే తాను ఈ న్యాయ పోరాటానికి దిగానని అన్నారు.

పిల్లల చదువుకు డబ్బులే ఇవ్వని ఆయన, ఉద్యోగం ఇస్తానంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. మహానటుడు ఎన్టీఆర్ కే పార్టీ సభ్యత్వం లేకుండా చేశారని చెప్పారు. ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతోనే కార్యకర్తలు ఇంకా టీడీపీతో ఉన్నారని అన్నారు. కాలం ఎల్లవేళలా ఒకేలా ఉండదన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు గురించి ఆలోచించి ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు.

Related posts