ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్, వైసీపీ మోహన్ బాబుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సాధారణంగా అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు తమ మనవలు, మనవరాళ్ళతో చేరినప్పుడు… పిల్లలకు కొత్త కొత్త విషయాలు, కథలు, పద్యాలు నేర్పిస్తుంటారు. అలాగే వారితో సరదాగా ఆటలాడుకుంటూ సమయాన్ని గడిపేస్తుంటాడు. ఇప్పుడు మంచు మోహన్బాబు కూడా ఖాళీ సమయంలో తన మానవరాళ్ళతో సరదాగా గడుపుతున్నారు. ఆయన ఇప్పుడు మంచు లక్ష్మి తనయ నివికి వేమన పద్యాలు నేర్పిస్తున్నారు. “ఉప్పు కప్పురంబు…” అనే పద్యాన్ని నివికి తనదైన స్టైల్లో డిఫరెంట్గా నేర్పించే ప్రయత్నం చేశారు మోహన్బాబు. నివి కూడా పద్యాన్ని మోహన్ బాబు ఎలా చెప్పారో… అలాగే ఆయన వాయిస్ ను అనుసరిస్తూ చెప్పింది. దీనికి సంబంధించిన వీడియో తీసిన మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకు “ఇద్దరినీ ఇలా చూస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇద్దరి మధ్య అనుబంధం రోజు రోజుకీ పెరుగుతుంది” అంటూ మెసేజ్ను కూడా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.