ప్రముఖ సినీ నటుడు, శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల చైర్మన్ మంచు మోహన్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం తన కుమారుడు మంచు విష్ణుతో కలసి లోటస్ పాండ్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిశారు. సుమారు అరగంటపాటు మోహన్బాబు ఆయనతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్, మోహన్ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్లు పాల్గొన్నారు.
చంద్రబాబు అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడు: ఏపీ మంత్రులు