ఐపీఎల్ ముందువరకు అతని పని అయిపోయింది అనుకున్నారు. కానీ అందులో మంచి ప్రదర్శన చేయడంతో పాటుగా ఆసీస్ పర్యటనలో తన ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు టీమిండియా పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్ట్ లో 5 వికెట్ హల్ సాధించిన సిరాజ్ పేస్ దళానికి నాయకుడిగా ముందుండి నడిపించాడు. అయితే ఈ పర్యటనకు ఎంపికై జట్టుతో కలిసి సిరాజ్ ఆసీస్ లో అడుగుపెట్టిన తర్వాత తన తండ్రి మహ్మద్ గౌజ్ మృతి చెందారు. అయితే తన తండ్రి మరణించిన తర్వాత అందరూ అతను తిరిగి భారత్ కు వచ్చేస్తాడు అనుకున్నారు. కానీ సిరాజ్ మాత్రం జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ భాధను దిగమింగుకొని అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అయితే టెస్ట్ సిరీస్ లో విజేతలుగా నిలిచిన టీం ఇండియా ఈరోజు తిరిగి భారత్ కు చేరుకుంది. అయితే సిరాజ్ కూడా ఈరోజు హైదరాబాద్ చేరుకున్నాడు. వచ్చి రాగానే అతను తన తండ్రి సమాధిని దర్శించుకున్నాడు. అయితే అప్పుడు జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్న సిరాజ్ ”టెస్ట్ జట్టుకు ఆడటం తన తండ్రి కల” అని పేర్కొన్నాడు. అయితే ఆసీస్ పర్యటన ఆధారంగా సిరాజ్ ను ఇంగ్లాండ్ టెస్ట్ లకు కుల ఎంపిక చేసింది బీసీసీఐ.
next post
కోడెల బాంబులకు భయపడలేదు..నీచ రాజకీయాలకు బలయ్యారు: దేవినేని