ప్రధాని మోదీ రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా ఆదివారం బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. మోదీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బదరీనాథ్ లో మోదీని చూసేందుకు ప్రజలు, భక్తులు ఆసక్తి కనబరిచారు. నిన్న హిమాలయాల్లోని పవిత్ర పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ను మోదీ దర్శించుకున్నారు. చివరి విడత పోలింగ్కు ఒక రోజు ముందు ఆయన ఆలయాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించుకొని అక్కడే హిమాలయాల్లోని పవిత్ర గుహల్లో దాదాపు ఇరవై గంటలపాటు ధ్యానంలో పాల్గొన్నారు.
రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కు: మాయావతి