telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

చెన్నై రైల్వే స్టేషన్ పేరు మార్చేసిన మోడీ.. ఇక నుండి ఎంజీ.రామచంద్రన్ .. !

pm modi fire pulvama terror attacks

నరేంద్రమోదీ తమిళనాడులోని కాంచీపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన అన్నాడీఎంకే సహా మిత్రపక్షాలతో కలిసి నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెన్నై రైల్వే స్టేషన్ పేరును మార్చబోతున్నట్టు చెప్పారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ పేరును స్టేషన్‌కు పెట్టాలనుకుంటున్నట్టు తెలిపారు. అలాగే, విమానాశ్రయాల్లో ఇకపై తమిళంలోనూ ప్రకటనలను చేయాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇష్టం లేని ప్రభుత్వాలను రద్దు చేస్తుందని ఆరోపించిన మోదీ.. గతంలో ప్రజలు ఎన్నుకున్న ఎంజీఆర్ ప్రభుత్వాన్ని కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఏకంగా 50 ప్రభుత్వాలను రద్దు చేయించారన్నారు. ప్రతిపక్ష నేతలందరూ తనను విమర్శించడంలో పోటీ పడుతున్నారన్న మోదీ.. తన కుటుంబంపై చెడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలే తమకు అధిష్ఠానమని, దేశ భద్రత విషయంలో తాము రాజీ పడబోమని ప్రధాని తేల్చి చెప్పారు.

Related posts