telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు..ఏపీ వ్యాప్తంగా నిరసనలు

chandrababu on modi tour in ap
ప్రధాని మోదీ ఏపీ పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. గన్నవరం విమానాశ్రయం నుంచి గుంటూరు వెంబడి రహదారిపై పెద్ద ఎత్తున మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘మోదీ గో బ్యాక్‌’ అంటూ  నల్ల జెండాలతో పలు చోట్ల ఆందోళనలు నిర్వహించారు. విజయవాడ లెనిన్‌ కూడలిలో వామపక్ష నేతలు నిరసనకు దిగారు. 
రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీ రాష్ట్ర పర్యటనకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. మోదీ పర్యటనను అడ్డుకుని తీరుతామని  తెలిపారు. మోదీ పర్యటనను నిరసిస్తూ కడప జిల్లాలో మట్టి, నీళ్ల కుండలతో వామపక్షాలు వినూత్నంగా నిరసన తెలిపాయి.  రాష్ట్రానికి ద్రోహం చేసిన మోదీ ఏపీలో అడుగు పెట్టవద్దని టీడీపీ  నేతలు నేతలు ఆగ్రం వ్యక్తం చేశారు.

Related posts