telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

వారణాసి నుండే.. మోడీ పోటీ.. !

Modi wishes to Imran Pakistan

లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ.. పోటీ చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్‌లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు నేతలు లోక్‌సభ ఎన్నికల గురించి విస్తృతంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్‌పై 3 లక్షల ఓట్లతో వారణాసిలో మోదీ నెగ్గారు.

కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌కు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే లోక్‌సభ కోసం మోదీ పోటీ చేసే రెండవ నియోజకవర్గం ఏదన్న దానిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.

Related posts