లోక్సభ ఎన్నికల్లో మరోసారి యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ.. పోటీ చేయనున్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుమారు మూడు గంటల పాటు నేతలు లోక్సభ ఎన్నికల గురించి విస్తృతంగా చర్చించారు. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ నేత కేజ్రీవాల్పై 3 లక్షల ఓట్లతో వారణాసిలో మోదీ నెగ్గారు.
కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్కు కేవలం 75 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. అయితే లోక్సభ కోసం మోదీ పోటీ చేసే రెండవ నియోజకవర్గం ఏదన్న దానిపై మరికొన్ని రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.