telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎడారిలో భారత సైన్యం .. యుద్ధ సన్నద్ధం.. పాక్ కోసం ప్రాక్టీస్ మ్యాచ్ ..

mock war in rajasthan desert by indian army

భారత సైన్యం నవంబరు 29 నుంచి డిసెంబర్‌ 4 వరకు ‘సింధు-సుదర్శన్’ పేరుతో రాజస్థాన్‌ ఎడారుల్లో విన్యాసాలు నిర్వహించనుంది. 40వేల మంది సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొననున్నారు. భవిష్యత్తులో యుద్ధం వస్తే పాల్గొనేందుకు కొత్తగా ఏర్పాటు చేసిన దళాలు కూడా ఇందులో పాల్గొననున్నాయి. శత్రు భూభాగంలోకి చొచ్చుకుపోయే సన్నద్ధతను ఈ విన్యాసాల్లో పరీక్షిస్తారు.

సైన్యానికి చెందిన ట్యాంకులు ఇతర ఆయుధ పరికరాలను కూడా పరీక్షించనున్నారు. పశ్చిమ సరిహద్దుల్లో యుద్ధ సన్నద్ధతపై సైన్యం సమీక్ష నిర్వహించనుంది. ఈ విన్యాసాల్లో లక్ష్యాలను ధ్వంసం చేయడం, బలగాల తరలింపు కోసం భారత వైమానిక దళం సైన్యానికి సహకరించనుంది. తద్వారా సైన్యం, వైమానిక దళం సమన్వయాన్ని కూడా పరీక్షించనున్నారు. ఈ విన్యాసాల కోసం ఎడారుల్లో పూర్తిగా యుద్ధ వాతావరణాన్ని సృష్టించనున్నారు.

Related posts