telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు… ప్రయాణీకుల ఇక్కట్లు

special train between vijayawada to gudur

సాంకేతిక కారణాలతో హైదరాబాద్‌ లో ఎంఎంటీఎస్‌ రైళ్లను నేడు తాత్కాలికంగా రద్దు చేయడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కార్యాలయాలకు వెళ్ల వలసిన ఉద్యోగులు, కాలేజీలకు వెళ్లవలసిన విద్యార్థులు నానా తంటాలు పడుతున్నారు. వారంతా మెట్రో రైళ్లను ఆశ్రయించడంతో, పలు స్టేషన్లు కమ్యూటర్లతో కిక్కిరిశాయి.

నిన్న బుధవారం నాడు 19 రైళ్లను పూర్తిగా, మరో 24 రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే, నేడు కూడా ఇదే పరిస్థితి కొనసాగనుందని ప్రకటించింది. నాంపల్లి – లింగంపల్లి, సికింద్రాబాద్‌ –ఫలక్‌ నుమా, జనగామ – ఫలక్‌ నుమా, నాంపల్లి – ఫలక్‌ నుమా, లింగంపల్లి – నాంపల్లి, ఫలక్‌ నుమా – సికింద్రాబాద్‌ రూట్లలో సర్వీసులను రద్దు చేశారు. అలాగే మరో 24 సర్వీసులను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు పేర్కొంది.

Related posts