telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబుకు పట్టం కట్టేందుకే మహిళలు: బొండా ఉమ

MLA Bonda Uma fire to Avanti

ఏపీ సీఏం చంద్రబాబు ప్రవేశపెట్టిన పథకాలు నేరుగా మహిళలకు అందాయని ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. రాష్ట్ర అభివృద్ది కోసం చంద్రబాబుకు మరోసారి పట్టం కట్టేందుకు భారీ సంఖ్యలో మహిళలు పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు. రాత్రి అయినా మహిళలు క్యూలైన్లలో నిలుచున్నారంటే, మేలు చేసిన ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికేనని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవడానికి మహిళలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం నుంచే బారులు తీరారని తెలిపారు.

ఎన్నికల్లో మహిళల ఓట్లన్నీ టీడీపీకే పడ్డాయని ఉమ అన్నారు. వైయస్ పాలన ఎలాంటిదో ప్రజలు చూశారని, చంద్రన్న పాలన ఏంటో ఈ ఐదేళ్లలో చూశారని చెప్పారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగపడడంతో మరోసారి తమ ప్రభుత్వాన్ని గెలిపించేందుకు మహిళలు అధిక సంఖ్యలో పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పారు.

Related posts