తెలంగాణలో ఎమ్మెల్యే కోటా కింద జరుగుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలకు మంగళవారం ఉదయం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పోటీలో లేనందున తొలి ప్రాధాన్య క్రమంలోనే టీఆర్ఎస్, మజ్లిస్ సభ్యులు గెలవడం ఖాయమైంది.
ఈ ఎన్నికల్లో అయిదు స్థానాలకుగాను టీఆర్ఎస్ నాలుగు స్థానాలకు పోటీ చేస్తూ, ఒక స్థానాన్ని మిత్రపక్షమైన మజ్లిస్కు కేటాయించింది. కాంగ్రెస్ కూడా అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు టీఆర్ఎస్ చేరుతున్నట్టు ప్రకటించడంతో పోలింగుకు ఒక రోజు ముందు కాంగ్రెస్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించింది.