telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజావేదిక కూల్చివేత కక్షసాధింపు చర్యే: బుద్దా వెంకన్న

ప్రజావేదిక అక్రమ కట్టడమని, దాన్ని కూల్చివేస్తామని కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పందించారు. తమ నాయకుడు చంద్రబాబు అడిగారనే కూల్చివేత నిర్ణయం తీసుకున్నారని, ఇది కక్షసాధింపు చర్యేనని అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు ప్రజా వేదిక ఇవ్వడం ఇష్టం లేకపోతే.. దానిని ఇంకో విధంగా ఉపయోగించుకోవాలని అన్నారు.

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలు హర్షించరని ఆయన అన్నారు. . ప్రజావేదిక కూల్చివేతపై సీఎం మరోసారి పునరాలోచించాలని బుద్దా వెంకన్న సూచించారు. ప్రజావేదిక భవనం కూల్చివేత నిర్ణయం సరికాదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ హయాంలోనే కరకట్టపై అక్రమ నిర్మాణాలు వెలిసాయని ఆయన తెలిపారు.

Related posts