telugu navyamedia
Uncategorized

వీఆర్వోని దూషించిన అంశం మీద స్పందించిన ఎమ్మెల్యే వివేక్..

కుత్బుల్లాపూర్‌ లో మండల రెవెన్యూ కార్యాలయ ఉద్యోగిని దూషించిన ఘటనపై కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కె.పి వివేకానంద గౌడ్ స్పందించారు. గాజుల రామారం సర్వే నంబర్ 79లో నిరుపేదల ఇళ్లను కూల్చి వేసిన ఘటనపై రెవిన్యూ సిబ్బందిని తిట్టిన మాట వాస్తవమేనని అన్నారాయన. గత ఆరేళ్ల నుంచి ఉంటున్న నిరు పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చి వేశారని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు.

 

అడ్డు వచ్చిన గర్బిణీని, వికలాంగులపై కూడా చేయి చేసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ ఉద్యోగుల అవినీతి, అక్రమాలను ఏ మాత్రం ఉపేక్షించనన్న ఎమ్మెల్యే వివేకానంద పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోనని స్పష్టం చేశారు. తన కోసమో, తన బంధువుల కోసమో రెవెన్యూ అధికారిని నిలదీయలేదని.. నియోజక వర్గ ప్రజల కోసమే తిట్టానని క్లారిటీ ఇచ్చారు. అలానే గూడు లేని పెద్దమ్మ నగర్ బస్తీ వాసులకు పట్టాలిప్పించి తీరుతానన్నారు ఎమ్మెల్యే.

Related posts