ఆంధ్రప్రదేశ్లోని నగరి ఎమ్మెల్యే రోజా శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్బుతంగా నిర్మాణం చేస్తున్నారని కొనియాడారు.
ఈ కాలంలో ఏవరికి దక్కని అవకాశం కేసీఆర్కు దక్కిందన్నారు. గతంలో తాను యాదాద్రికి వచ్చానని, అప్పటికీ ఇప్పటికీ అసలు పోలికే లేదని ఆమె అభిప్రాయపడ్డారు. కేసీఆర్ నిజంగా కారణజన్ముడు అని రోజా చెప్పుకొచ్చారు.
భగవంతుడే కేసీఆర్ ద్వారా తనకు కావాల్సిన ఆలయాన్ని నిర్మించుకున్నారని పేర్కొన్నారు. లక్ష్మి నరసింహా స్వామి చాలా పవర్ఫుల్.. ఇంత పెద్ద గుడి కట్టాలంటే భగవంతుడి ఆశీస్సులు ఉండాల్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషించే విధంగా ఆలయం నిర్మాణం జరిగిందని తెలిపారు. ఆలయ నిర్మాణానికి వాడిన రాయి గుంటూరు నుంచి తీసుకు వచ్చారని, ఎప్పటికీ తెలుగువారు అన్నదముళ్ళు, అక్కచెల్లెలుగా కలిసి ఉంటారని రోజాఆకాంక్షించారు.
కేసీఆర్ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పిస్తారా?