మంత్రి పదవి దక్కలేదని తనకు ఏమాత్రం బాధలేదని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రోజా ఈరోజు విజయవాడ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కులాల ఈక్వేషన్ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదన్నారు. మంత్రి పదవి ఇవ్వనందుకు తాను అలిగానని వస్తున్న వార్తలు మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.
తాను కులాలను ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. నామినేటెడ్ పోస్ట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోందన్న ప్రశ్నకు రోజా స్పందిస్తూ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ రోజు నుంచి ఇప్పటికే అన్ని పోస్టులను ఛానెల్స్ వాళ్లు ఇచ్చేశారని అన్నారు. మంత్రి పదవులు దక్కించుకున్న వారందరికి రోజా శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోవాలంటే జనసేనను గెలిపించాలి: పవన్