వైసీపీ ఎమ్మెల్యే రోజా ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలను చేపట్టారు. తన ఛాంబర్ లో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం బాధ్యతలను స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకు కేబినెట్ లో చోటు లభిస్తుందని అందరూ భావించారు. ఆమెకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం కూడా జోరుగా జరిగింది.
అయితే పలు సమీకరణాల నేపథ్యంలో, ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. దీంతో, ఆమె ఎంతో నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్గా నియమిస్తూ సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.