telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎమ్మెల్యే రేగాను అడ్డుకున్న ప్రజలు.. పార్టీ ఎందుకు మారవని నిలదీత

తెలంగాణ లో పార్టీ మారిన ఓ ఎమ్మెల్యేకు ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. భద్రాద్రి జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రేగా కాంతారావును ప్రజలు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రేగాను ప్రజలు అడ్డుకున్నారు. పార్టీ ఎందుకు మారారంటూ నిలదీశారు.

కాంగ్రెస్ నుంచి గెలిచి, టీఆర్ఎస్‌లోకి వెళ్లడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌కు మద్దతుగా ఎలా ప్రచారం చేస్తారంటూ నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనుచరులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. వివాదం మరింత ముదురుతుండటంతో ప్రచారంలో పాల్గొనకుండానే ఎమ్మెల్యే రేగా కాంతారావు వెనుదిరిగారు.

Related posts