తెలంగాణ శాసన మండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యులు నిరాడంబరంగా ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికైన ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేసేందుకు రావడంతో శాసనమండలి ప్రొటెం ఛైర్మన్ ప్రమాణస్వీకారం చేయించారు. కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి, వెంకట్రమి రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు.
మరో ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వ రాజీనామా ఆమోదం పొందిన తర్వాత ప్రమాణం చేస్తారు. జూన్ 3న ఆరుగురు ఎమ్మెల్యే కోటా కింద శాసన మండలి సభ్యుల పదవీ కాలపరిమితి పూర్తయింది. వారి స్థానంలో నవంబర్ 22న ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
ప్రాజెక్టు నిర్మాణాలను తప్పుబట్టిన కోదండరాం