telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

కేవలం 21 నిమిషాల్లో.. పాక్ స్పందించే లోపే పని పూర్తి

Mirage 2000 jets cross PoK terror camp

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక మంగళవారం దళాలు మెరుపు దాడులు చేశాయి. పాకిస్థాన్ ఆర్మీ విమానాల రాకను పసిగట్టే లోపే భారత వైమానిక దళాలు కేవలం 21 నిమిషాల్లో దాడులు పూర్తి చేసుకుని వెంటనే తిరిగి బేస్ క్యాంప్ నకు చేరుకున్నాయి. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే జైషే మహ్మద్‌ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమయ్యాయి.

భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్‌ 2000 యుద్ధ విమానం కీలకపాత్ర పోషించింది. దాదాపు వెయ్యి కిలోల బాంబులను వైమానిక దళం ఉగ్రవాద శిబిరాలపై ప్రయోగించగా, జైషే మహ్మద్‌కు చెందిన అల్పా-3 కంట్రోల్‌ రూం పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. గంటకు 1200 కిలోమీటర్ల వేగంతో యుద్ధ విమానాలు ప్రయాణించాయి. విషయాన్ని పాక్ రాడార్లు పసిగట్టి, అప్రమత్తమయ్యేలోగానే దాడులను పూర్తి చేసిన ఫైటర్ జెట్స్ తిరిగి భారత భూభాగంలోకి తిరిగి వచ్చేశాయి.

Related posts