telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కోల్ కతా ర్యాలీతో బీజేపీ గుండెల్లో రైళ్లు: యనమల

Minister Yanamala comments Ys Jagan

పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం కోల్‌కతాలో నిర్వహించిన   మెగా ర్యాలీని చూసి అధికార బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఒకే వేదికపై 22 విపక్ష పార్టీల నేతలను చూసిన బీజేపీ నేతలకు భయం పట్టుకుందని విమర్శించారు. రాఫెల్ కుంభకోణం కన్నా పెద్ద దోపిడీ ఏముందని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ బ్యాంకులకు వేల కోట్ల రూపాయిలు ఎగ్గొట్టిన వ్యక్తుల వెనుక ఎవరున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతి గురించి ప్రధాని మోదీ మాట్లాడటం సిగ్గుచేటని యనమల అన్నారు.

ప్రస్తుతం దేశంలోని తోడు దొంగలంతా బీజేపీలోనే ఉన్నారని దుయ్యబట్టారు. బీజేపీ పతనం అంచులో ఉంది కాబట్టే ప్రధాని మోదీలో అసహనం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రధాని మోదీ పాలనకు వ్యతిరేకంగా కోల్ కతా ర్యాలీ జరిగిందని యనమల స్పష్టం చేశారు. ఎస్సీ, బీసీ, ముస్లింలలో మోదీ పాలనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని యనమల పేర్కొన్నారు.

Related posts