telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భౌతిక దూరం పాటించి..కరోనాను తరిమికొడదాం: మంత్రి సురేష్

suresh adimulapu minister

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విజృంభించడంతో రోజురోజుకూ కోవిడ్-19 బాధితుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకూ ఏపీలో 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ నేడు ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా గిరిజన గూడేల్లో 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలకు మాస్కులు, శానిటైజర్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భౌతిక దూరం పాటించి కరోనాను తరిమికొడదామని మంత్రి పిలుపునిచ్చారు.

Related posts