విజయవాడ నగర అభివృద్ధిని గత పాలకులు నిర్లక్ష్యం చేశారని ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. గరంలోని ఉర్మిలా నగర్, బ్రహ్మంగారి కాలనీ, జోజి నగర్ తదితర ప్రాంతాల్లో ఈరోజు ఉదయం మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి పర్యటించారు. తాగునీటికి కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వర్షం పడితే బయటకు వచ్చే పరిస్థితి లేదని డ్రైనేజీలో సక్రమంగా లేవని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విజయవాడకు చంద్రబాబు, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు చేసిన అభివృద్ధి ఇదేనా? అని ప్రశ్నించారు.
టీడీపీ నేతలకు జగన్, వైసీపీ నాయకులపై విమర్శలు చేయడానికే ఇదేళ్ళ సమయం సరిపోయిందని విమర్శించారు.అందరికి తాగునీరు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. విజయవాడ నగరంలో మురుగు నీరు, వర్షపు నీరు రోడ్ల పై పారకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
అర్ధరాత్రి ఇసుక ఆన్ లైన్ బుకింగ్ ఎందుకు?: పవన్ కల్యాణ్