ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్నారు. ఈరోజు సాయంత్రమే అసెంబ్లీ కార్యదర్శికి సోమిరెడ్డి రాజీనామా పత్రం అందించనున్నారు. కాగా సోమిరెడ్డి వచ్చే ఎన్నికలలో నెల్లూరు జిల్లా సర్వేపల్లి నుండి పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.
గత ఎన్నికలలో సర్వేపల్లి నుండే పోటీచేసి వైసీపీ అభ్యర్థి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఐదువేల మెజార్టీతో ఓడిపోయారు. అయినా చంద్రబాబు సోమిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రిగా ఐదేళ్లు నియోజకవర్గంలో పట్టు సాధించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈసారి గెలుపు పై ధీమా వ్యక్తం చేస్తున్నారు.