telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

చంద్రబాబుపై అప్పుడే కేసు పెట్టుంటే బుద్దొచ్చి ఉండేది…

రుయా ఆసుపత్రి ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది. ముఖ్యమంత్రి రుయా ఘటన పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యతగా ఉండాల్సిన టీడీపీ క్యాండిల్ నిరసన చేపట్టింది. చంద్రబాబుకు , టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా… కడుపుకు అన్నం తింటున్నారా … గడ్డి తింటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి అప్పలరాజు. పుష్కరాల్లో సుమారు 40 మంది చనిపోయిన ఘటన చంద్రబాబు మర్చిపోతే ఎలా. అప్పుడే హత్యాయత్నం కేసు పెట్టుంటే చంద్రబాబుకు బుద్దొచ్చి ఉండేది అన్నారు. అచ్చెన్నాయుడు ఒక్కసారి చరిత్ర గుర్తు తెచ్చుకోవాలి. మీనాయకుడు ప్రచార ఆర్భాటానికి జనం బలైపోతే ఆరోజు కూడా ఇలాగే అడిగావా.. అచ్చెన్నాయుడికి సిగ్గుందా…దెయ్యంలా క్యాండిల్ నిరసన చేస్తావా. విజయవాడలో కోవిడ్ హాస్పిటల్లో కొంతమంది చనిపోయారు. కనీసం ఒక్కరి కోసమైనా విచారం వ్యక్తం చేశావా… హాస్పిటల్ కు అనుకూలంగా విచారణ చేయొద్దంటూ కోర్టులకు వెళ్లారు. ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా అని అన్నారు.

Related posts