telugu navyamedia
ఆంధ్ర వార్తలు

చంద్ర‌బాబు కుప్పం కోట‌ కూలిపోనుంది..పిచ్చాస్పత్రిలో చేరే టైమొచ్చింది..

*వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం
*చంద్ర‌బాబు కుప్పం కోట‌ కూలిపోనుంది..
* చంద్రబాబు కు పిచ్చాస్పత్రిలో చేరే టైమొచ్చింది..

టీడీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై మంత్రి రోజా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోనుందని ఎద్దేవా చేశారు.

రాజమహేంద్రవరంలో మంత్రి రోజా శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు..వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం అని అన్నారు. చంద్రబాబు పిచ్చి ఆసుపత్రిలో చేరే రోజులు దగ్గరపడ్డాయని, అందుకే పిచ్చి ఎక్కినట్లు ప్రవర్తిస్తున్నాడని రోజా మండిపడ్డారు.

సీఎం జగన్ ఎప్పుడెప్పుడు బట్ నొక్కి సంక్షేమ పథకాలను ప్రవేశ పెడతారో.. అప్పుడు చంద్రబాబు ఏదో ఒక రకంగా సంక్షోభం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలకు మేలు జరుగడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని నిప్పులు చెరిగారు

మొన్నటి వరకు ఎంపీ గోరంట్ల మాధవ్ ఫేక్ వీడియోను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రాజకీయాలు చేశారని అన్నారు. ఇప్పుడు కుప్పంలో అల్లర్లు సృష్టించి ఆ బురదను వైఎస్ఆర్ సీపీపై చల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని రోజా తప్పుబట్టారు

మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను జూనియర్ ఎన్టీఆర్ కలిసిప్పటి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. మరోవైపు బాలకృష్ణ ఉచిత ఆరోగ్య రథం ప్రారంభించి ఆ రథంపై కేవలం ఎన్టీఆర్, బాలకృష్ణ ఫోటోలనే ముద్రించుకున్నారని చంద్రబాబు ఫోటో ఆ రథంపై ముద్రించలేదని ఎద్దేవా చేశారు. దీనిని బట్టి నందమూరి ఫ్యామిలీలో చంద్రబాబు విలువ పడిపోయినట్లుగా అర్థం అవుతోందని రోజా వ్యాఖ్యలు చేశారు

తనకు అన్ని రకాలుగా కష్టకాలం ఎదురవడంతో.. ఏం చేయాలో అర్ధం కాక ఫ్రస్టేషన్లో బాబు ఏదేదో చేస్తున్నారని విమర్శించారు మంత్రి రోజా. చంద్రబాబు పిచ్చాస్పత్రిలో చేరే రోజు దగ్గర్లో ఉందంటూ మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు.

Related posts