*శ్రీవారిని దర్శించుకున్న మంత్రి రోజా..
*చంద్రబాబును ప్రజలు బోగస్ బాబు అని పిలుస్తారు..
*చంద్రబాబుకు రింగ్లో చిప్ కాదు..బుర్రలో చిప్ ఉండాలి..
*ఒక్కప్పుడు బీజేపీ తిట్టిన చంద్రబాబు ఇప్పుడు కాల్లు పట్టుకుంటున్నాడు..
*చంద్రబాబుకు చిన్న మెదడు చిట్లిపోయింది..
తిరుమల శ్రీవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఉదయం విఐపీ దర్శన సమయంలో మంత్రి రోజా స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు.అనంతరం ఆలయం అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేసారు.
అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆమె…. తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
బోగస్ సర్వేలు చేయించే చంద్రబాబుని ప్రజలందరూ బోగస్ బాబుగా పిలుస్తున్నారని అన్నారు. పడిపోయిన టీడీపీ జాకీలు పెట్టి లేపడానికి ఎల్లో మీడియా ప్రయత్నిస్తోంది .
పది రోజులకి ముందు సీఎం అయినా మహారాష్ట్ర సీఎంకు టాప్ 5 ర్యాంకు, మూడు సంవత్సరాలుగా అన్ని పథకాలను అమలు చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్కి అట్టడుగు ర్యాంకు ఇవ్వడంపై రోజా మండిపడ్డారు.
చంద్రబాబు, నారా లోకేష్కి చిన్న మెదడు చిట్లిపోయిందని, త్వరలోనే మానసిక వైకల్య కేంద్రంలో చంద్రబాబు చేర్పించాలని మంత్రి రోజా నిప్పులు చెరిగారు.