టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ ధర్మసూక్తులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు రూ.10కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. సొమ్ము ప్రజలది..సోకు టీడీపీది అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.’
రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేశారు. టీటీడీ నిధులను కూడా దీక్షల కోసం వినియోగించారు. మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి చివరిలో డ్రామాలాడారు. ఇప్పుడు మోదీతో పెట్టుకుని తప్పు చేశామని యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తండ్రీకొడుకులు అమిత్షాకు సాగిలపడి లవ్లెటర్లు రాస్తున్నారని అన్నారు. బంగారు బాతులాంటి రాజధాని నిర్మించామని ఊదరగొడుతున్నారు. మరి చంద్రబాబు కట్టిన బంగారు బాతు ఎక్కడ అని ప్రశ్నించారు.
ప్యాకేజీల కోసమే టీడీపీ నేతలపై రోజా వ్యాఖ్యలు: పంచుమర్తి అనురాధ