telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సొమ్ము ప్రజలది, సోకు టీడీపీది..చంద్రబాబుపై మంత్రి నాని విమర్శలు

perni nani minister

టీడీపీ అధినేత చంద్రబాబు పై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ ధర్మసూక్తులు చెప్పే చంద్రబాబు ఢిల్లీలో ఒక్క రోజు దీక్షకు రూ.10కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఆరోపించారు. సొమ్ము ప్రజలది..సోకు టీడీపీది అన్నట్లు చంద్రబాబు వ్యవహరించారని దుయ్యబట్టారు.’

రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు ప్రజాధనాన్ని వృథా చేశారు. టీటీడీ నిధులను కూడా దీక్షల కోసం వినియోగించారు. మోదీ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి చివరిలో డ్రామాలాడారు. ఇప్పుడు మోదీతో పెట్టుకుని తప్పు చేశామని యాక్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు తండ్రీకొడుకులు అమిత్‌షాకు సాగిలపడి లవ్‌లెటర్లు రాస్తున్నారని అన్నారు. బంగారు బాతులాంటి రాజధాని నిర్మించామని ఊదరగొడుతున్నారు. మరి చంద్రబాబు కట్టిన బంగారు బాతు ఎక్కడ అని ప్రశ్నించారు.

Related posts