telugu navyamedia
తెలంగాణ వార్తలు

విజయదశమి తర్వాత చక్రం తిప్పేందుకు కేసీఆర్ బయలుదేరతారు

*విజయదశమి తర్వాత దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ చక్రం తిప్పుతారు..

*సీఎం కేసీఆర్ దేశ్ కీ నేత.. ప్రధాని కావాలి..

*బీజేపీ అంటేనే జూటా పార్టీ..

*బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే..నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా..

బీజేపీ అంటేనే జూటా పార్టీ అని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి విమ‌ర్శించారు. శుక్రవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వని మోదీ.. కేసీఆర్​పై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు.

కేసీఆర్‌ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానని మంత్రి మల్లారెడ్డి అన్నారు.తెలంగాణను బీట్‌ చేసే మగాడు ఎవరూ లేరని మల్లారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌కు ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలన్నారు.

ఆ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆయన సవాల్‌ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మల్లారెడ్డి పేర్కొన్నారు.

రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమేనని.. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకుని విజయదశమి నాడు చక్రం తిప్పేందుకు కేసీఆర్ బయలుదేరతారని ఆయన చెప్పారు. కేసీఆర్ దేశ్‌కీ నేత అని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు .

 

Related posts