ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎత్తేసి దండయాత్ర చేస్తున్న కాలకేయుడని మోదీపై లోకేశ్ ధ్వజమెత్తారు. ఆంధ్రులు తలెత్తుకొని నిలబడేలా చేసిన బాహుబలి సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ‘‘ఏపీ హెరిటేజ్ చుసుకోవడానికి చంద్రబాబున్నారు.
జగన్ అక్రమాస్తుల హెరిటేజ్కి మోదీ చౌకీదారుగా మారారు. ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కేలేదా?’’ అని ట్విట్టర్ లో ప్రశ్నించారు. 54 వేల కోట్ల పోలవరం ప్రాజెక్ట్కి కేవలం 6 వేల కోట్లిచ్చి పూర్తిచేయలేదంటున్నారు. మీకు లెక్కలు రావా? ఆంధ్రుల జీవనాడి పోలవరం అంటే లెక్కే లేదా? అని మోదీపై లోకేష్ విమర్శలు గుప్పించారు.