telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పంజాగుట్ట స్టీల్ బ్రిడ్జి ప‌నుల‌ను పరిశీలించిన కేటీఆర్

KTR TRS Telangana

హైద్రాబాద్ నగరంలోని పంజాగుట్ట వద్ద రూ. 23 కోట్ల వ్యయంతో చేపట్టిన స్టీల్‌ బ్రిడ్జి, రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తిచేయాలని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఆదివారం మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. రోడ్ల విస్తరణ చేసి నిర్మిస్తున్న స్టీల్‌ బ్రిడ్జి గడ్డర్ల అమర్చే పనులను మంత్రి కేటీఆర్‌ పరిశీలించారు. లాక్‌డౌన్‌ వల్ల కలిగిన వెసులుబాటుతో అదనంగా కార్మికులను. నిపుణులను నియమించి రేయింబవళ్లు పనులు చేయిస్తున్న కాంట్రాక్టర్‌ను మంత్రి అభినందించారు.

ఇదేస్పూర్తితో తగిన చర్యలు తీసుకుంటూ ఆధునిక యంత్రాలతో మరో నెల రోజుల్లోపనులను పూర్తి చేయాలని తెలిపారు. స్టీల్‌ బ్రిడ్జి రెండు వైపులా రెండు లేన్ల విస్తరణ పనులు 50శాతం పూర్తిఅయినట్టు జీహెచ్‌ఎంసి ప్రాజెక్ట్స్‌ చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌ వివరించారు. నిత్యం రద్దీగా ఉండే పంజాగుట్ట మార్గంలో ప్రయాణించే వాహనదారుల ఇబ్బందులు మరో నెల రోజుల్లో పూర్తిగా తొలగిపోనున్నాయి. మంత్రి కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, పురపాలక శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌, స్థానికి కార్పొరేటర్‌, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Related posts