తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ ఈ రోజు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు రోడ్డు మార్గాన మంత్రి సిరిసిల్ల చేరుకొంటారు. సిరిసిల్లలోని పొదుపుభవన్లో కలెక్టర్తో పాటు ఆయా అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
ప్రధానంగా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ సమీక్షలో అధికారులతో చర్చిస్తారు. అనంతరం, మధ్యాహ్నం 3 గంటలకు నూతనంగా నిర్మించిన తంగళ్లపల్లి పోలీస్స్టేషన్ను మంత్రి ప్రారంభిస్తారు.